తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 157 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో నవంబర్ 13, శనివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,73,469 కి చేరింది. కొత్తగా కరోనాతో మరోకరు మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,973 కు పెరిగింది. అలాగే మరో 156 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి 6,65,755 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 56, కరీంనగర్ లో 19, రంగారెడ్డిలో 13, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 11, వరంగల్ అర్బన్ లో 11 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (నవంబర్ 13, సాయంత్రం 5.30 గంటల వరకు):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 2,80,26,658
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 6,73,469
- కొత్తగా నమోదైన కేసులు : 157
- నమోదైన మరణాలు : 1
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 6,65,755
- కరోనా రికవరీ రేటు: 98.85%
- యాక్టీవ్ కేసులు: 3,741
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 3,973
- కరోనా మరణాల రేటు: 0.58%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ