ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 26, గురువారం నాడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మే 26న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సమీక్ష సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, మే 26వ తేదీన ఐఎస్బీలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారని, ఎన్.ఎస్.జి తో సమన్వయంతో వివిధ శాఖలు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ అనుసరించి పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి, పౌర సరఫరాల శాఖ కమీషనర్ అనిల్ కుమార్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, రాజ్భవన్ గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్, అగ్నిమాపక శాఖ డీజీ సంజయ్ కుమార్ జైన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF