హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు, వరదలు వలన తీవ్ర నష్టం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు పలువురు విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ మరియు అనుబంధ ఉద్యోగ సంఘాలు కూడా తమ ఒక్కరోజు మూల వేతనాన్ని విరాళంగా ప్రకటించాయి. రాష్ట్ర ఎక్సైజ్, క్రీడ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఒకరోజు వేతనమైన సుమారు 33 కోట్ల రూపాయలను తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేస్తున్నట్లు వారు ప్రకటించారు. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తన ఒక్క రోజు మూల వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేసి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu