తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదల వలన ఏర్పడ్డ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం హైదరాబాద్ నగరానికి చేరుకుంది. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరి ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ఇంటర్ మినిస్టీరియల్ బృందం గురువారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ని బిఆర్ కెఆర్ భవన్ లో కలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో వరదల పరిస్ధితి, చేపడుతున్న సహాయక చర్యల పై చర్చించారు. అలాగే ఈ బృందం రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి రాష్ట్రంలో ఆస్తులకు, పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తుంది. ఈ బృందంలో ప్రవీణ్ వశిష్ట తో పాటుగా కన్సల్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్.బి.కౌల్, వ్యవసాయశాఖ డైరెక్టర్ కె.మనోహరన్, రవాణా శాఖ ఎస్ఈ ఎస్.కె.కుషువహా, కేంద్ర జలవనరులశాఖ ఎస్ఈ ఎమ్.రఘురామ్ ఉన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu