తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇంకోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఆంక్షలను జనవరి నెల చివరి వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిప్రకారం.. ఈ నెలాఖరు వరకు కొన్ని కార్యక్రమాలపై నిషేధం అమలవుతుంది. సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలను నిషేదించారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా నిబంధలను కఠినతరం చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే, రాష్ట్రంలో ప్రజలందరూ కరోనా జాగ్రత్తలను పాటించాలని స్పష్టం చేసారు. అందరూ మాస్కులు ధరించాలని, శానిటైజేషన్ మర్చిపోరాదని తెలిపారు. అలాగే, వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF