మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 21, సోమవారం నాడు 6270 కరోనా కేసులు, 94 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 59,79,051 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,18,313 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 13,758 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 57,33,215 కు చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.89 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.98 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 1,24,398 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ముంబయిలో అత్యధికంగా 18529 యాక్టీవ్ కేసులు ఉండగా, పుణేలో 16827, థానేలో 13681, కొల్హాపూర్ లో 9596, సంగ్లీలో 9454 కేసులు ఉన్నాయి. మరోవైపు సోమవారం నాటికి మహారాష్ట్రలో 3,96,69,693 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ