తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా దర్బార్ లో భాగంగా జూన్ 10, శుక్రవారం నాడు రాజ్ భవన్ లో “మహిళా దర్బార్” నిర్వహించాలని నిర్ణయించారు. మహిళా దర్బార్ లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు గవర్నర్ తమిళిసై మహిళల సమస్యలు విననున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
సమస్యలు చెప్పుకునేందుకు గవర్నర్ను వచ్చి కలవాలనుకునే మహిళలు 040-23310521 నంబర్ కు ఫోన్ చేయడం ద్వారా లేదా వారి అభ్యర్థనను [email protected]కు ఈ-మెయిల్ చేయడం ద్వారా అపాయింట్మెంట్ పొందవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల నగరంలో మహిళలపై అత్యాచార ఘటనలు సంచలనం సృష్టించిన నేపథ్యంలో, ఇంకా వెలుగు చూడని సంఘటనలు, మహిళల ఇతర సమస్యల దృష్ట్యా గవర్నర్ తమిళిసై తాజాగా మహిళా దర్బార్ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY