తెలంగాణ రాజ్భవన్లో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనది. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఫ్రంట్ లైన్ వారియర్స్కు గణతంత్ర దినోత్సవ శుభకాంక్షలు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ దేశ వ్యాప్తంగా ఉదృతంగా కొనసాగుతోంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా రెండు వందల కోట్ల వ్యాక్సిన్ పూర్తి చేసుకోబోతున్నాం. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళుతోంది అని గవర్నర్ తమిళిసై అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF