ప్రగతి భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలకు సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంఓ అధికారులు, తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పరేడ్ గ్రౌండ్ లో అమర జవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ