కరోనా నుంచి కోలుకున్న వారిలో కొందరికి బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి సోకుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ వ్యాధి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎపిడెమిక్ డిసీజెస్ ఆక్ట్ 1897 కింద మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) అనే వ్యాధిని నోటిఫియాబుల్ వ్యాధిగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యాధికి సంబంధించి స్క్రీనింగ్, రోగ నిర్ధారణ, చికిత్స విషయంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కేంద్ర ఆరోగ్యశాఖ మరియు ఐసీఎంఆర్ జారీచేసిన మార్గదర్శకాలను పాటించాలని ఆదేశాలు ఇచ్చారు.
అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల మెడికల్ సూపెరింటెండెంట్స్ ప్రతి రోజూ ఈ వ్యాధికి సంబందించిన అనుమానిత మరియు నిర్ధారణ కేసుల సమాచారాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖకు అందించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి. శ్రీనివాసరావు బుధవారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ