వినాయక చవితి పండుగ సందర్భంగా ఆగస్టు 31న ప్రారంభమయిన గణేష్ ఉత్సవాలు రేపు (సెప్టెంబర్ 9, శుక్రవారం) జరిగే నిమజ్జన శోభాయాత్రలతో ముగియనున్నాయి. నగరంలో రేపు నిర్వహించే గణేష్ నిమజ్జనం కోసం హుస్సేన్సాగర్ వద్ద ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా సెప్టెంబర్ 9, శుక్రవారం నాడు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతో పాటుగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మూడు జిల్లాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సెప్టెంబర్ 9వ తేదీన సెలవు ప్రకటిస్తునందువలన, ఈ సెలవుకు బదులుగా ఈ మూడు జిల్లాల పరిధిలో నవంబర్ 12న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటించిస్తునట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY