తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 3న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఉపఎన్నిక కోసం నేడు (అక్టోబర్ 7, శుక్రవారం) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, నేటి నుండే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే కోరుకుంటూ స్థానిక నాయకులు, కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన మీదట సిఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
తాజాగా మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు ప్రకటించడంతో, పోటీలో నిలిచే అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు అయినట్టు అయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ బరిలో దిగుతున్నారు. అన్ని పార్టీలు మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పార్టీల అభ్యర్థులు కూడా కూడా ఖరారు కావడంతో ఇక మునుగోడులో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకోనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY