తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) వేతనాన్ని పెంచింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రస్తుతం నెలకు రూ.15వేలు వేతనం అందజేస్తుండగా, తాజగా వేతనాన్ని రూ.28,719కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాలు జూలై 1 నుంచే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి ఎం.రఘునందర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్ పీరియడ్ ను కూడా 3 నుంచి 4 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ