నల్గొండ జిల్లా హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ఆదివారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. హాలియాలో డిగ్రీ కాలేజీ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో హాలియాలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హాలియా డిగ్రీ కాలేజ్ భవన నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే 2021-22 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ