దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 40 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 32,981 కేసులు నమోదు కావడంతో డిసెంబర్ 7, సోమవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 96,77,203 కు చేరుకుంది. కరోనాతో మరో 391 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,40,573 కి పెరిగింది. అదేవిధంగా దేశంలో ఇప్పటికే 91 లక్షల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ఒకేరోజులో 39,109 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 91,39,901 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 94.45 శాతం గానూ, మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. ప్రస్తుతం 3,96,729 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 140 రోజుల తర్వాత దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 4 లక్షల కంటే దిగువకు చేరింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, కర్ణాటక, గుజరాత్, మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా నమోదైనా 32,981 కేసులలో 76 శాతం ఈ 10 రాష్ట్రాలలో నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ