కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి సోమవారం నాడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అరుణ్సింగ్ విజయశాంతికి కాషాయకండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వియశాంతి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయమని అన్నారు. ముందుగా 1998 లోనే తానూ బీజేపీలో చేరానని, ఆతర్వాత తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ అనుకూలంగా లేనందువలనే బయటకి వచ్చినట్టు తెలిపారు. ఇప్పుడు పార్టీ విధివిధానాలు నచ్చడం వలన తిరిగి బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని, తెలంగాణ ప్రజలు బాగుండడమే తనకు ముఖ్యమని విజయశాంతి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ