తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 22, మంగళవారం నాడు తుది నోటిఫికేషన్ జారీచేసింది. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో నూతనంగా పోతంగల్ రెవిన్యూ మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నిజామాబాద్ జిల్లాలో మండలాల సంఖ్య 33కు పెరిగింది. మొత్తం 14 గ్రామాలతో పోతంగల్ మండలం ఏర్పాటు కాగా, ఇది బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి రానుంది. పొతంగల్, కొడిచెర్ల, జల్లపల్లి, కల్లూర్, హంగేర్గా, హెగ్డోలి, కొల్లూర్, దోమలెడ్గి, సోంపూర్, టాక్లీ, సుంకిని, కారేగాం, హుమ్నాపూర్, తిర్మలాపూర్ వంటి 14 గ్రామాలు కొత్త పోతంగల్ మండలంలో ఉండనున్నాయి.
నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ పరిధిలో కొత్తగా పోతంగల్ మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై తెలంగాణ శాసనసభ స్పీకర్, జిల్లా కీలక నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి హర్షం చేశారు. పోతంగల్ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరిందని, పోతంగల్ కేంద్రంగా నూతన మండల ఏర్పాటు ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE