బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఐదో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కు తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 28వ తేదీ నుంచి బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ప్రారంభం కానుంది. నిర్మల్ నియోజకవర్గంలోని అడెల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భైంసాలో ప్రారంభ సభతో బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర మొదలుపెట్టనున్నారని ప్రజా సంగ్రామ యాత్ర సహ ప్రముఖ్ టి.వీరేందర్ గౌడ్ తెలిపారు. అలాగే డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో కరీంనగర్ లో ముగింపు సభ ఉంటుందని తెలిపారు. బండి సంజయ్ ఇప్పటి వరకు 4 విడతలుగా పాదయాత్ర చేసి 13 ఎంపీ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు మొత్తం 21 జిల్లాల్లో 1178 కి.మీల మేర నడిచినట్టు పేర్కొన్నారు.
అదేవిధంగా ఈ నెల 26 నుంచి డిసెంబర్ 14 వరకు ‘ప్రజాగోస-బీజేపీ భరోసా యాత్ర’ నిర్వహించనున్నట్టు తెలంగాణ బీజేపీ ప్రకటించింది. మెదక్, దుబ్బాక, ఆందోల్, జహీరాబాద్, గద్వాల్, నాగర్ కర్నూలు, జడ్చర్ల, షాద్నగర్, చేవెళ్ల, పరిగి, నల్గొండ, సూర్యాపేట, తుంగతుర్తి, పరకాల, వర్దన్నపేట, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో ప్రజాగోస-బీజేపీ భరోసా యాత్ర పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ప్రతి గ్రామంలో సభలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE