ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి 100 శాతం సీటింగ్ సామర్ధ్యంతో (ఆక్యుపెన్సీ) థియేటర్ల నడపడానికి కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్సులను 100 శాతం సీటింగ్ సామర్ధ్యంతో నడిపేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. థియేటర్స్, మల్టీప్లెక్స్ల యాజమాన్యాలు గతంలో ప్రభుత్వం ప్రకటించిన కరోనా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్స్ (ఎస్ఓపీలు) ను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ మేరకు గురువారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ