తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో ఏడు రౌండ్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు వచ్చిన 16 మంది అభ్యర్థులు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు.
మొదటి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,10,840 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 83,290 ఓట్లు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కు 70,072 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డికి 39,107 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ కు 27,588 ఓట్లు పోలయ్యాయి. అలాగే మొత్తం ఏడు రౌండ్లలో 21,636 ఓట్లను చెల్లని ఓట్లుగా గుర్తించారు. ఏడు రౌండ్ల కౌంటింగ్ సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్న కంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఈ స్థానంలో గెలుపొందాలంటే 1,83,167 ఓట్లు రావాల్సి ఉంది. అందులో భాగంగా విజయం కోసం పల్లా రాజేశ్వర్ రెడ్డికి 72,327 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 99,877, ప్రొఫెసర్ కోదండరామ్కు 1,13,095 ఓట్లు రావాల్సి ఉంటుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనైనా ఏ అభ్యర్థికైనా మెజార్టీ దక్కుతుందో లేదో వేచి చూడాలి. ఎవరికీ మెజార్టీ దక్కకుంటే వరుసగా అభ్యర్థుల ఎలిమినేషన్ అనంతరం చివరికి మిగిలిన ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికీ ఎక్కువ ఓట్లు వస్తే వారినే విజేతగా ప్రకటించనున్నారు. ఈ స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, ప్రొఫెసర్ కోదండరామ్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ