తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 313 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 18, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 142 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,98,262 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 98.64 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1664 కి పెరిగింది. కాగా మరణాల రేటు 0.55 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,434 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 47, రంగారెడ్డి జిల్లాలో 29, నిర్మల్ లో 25, మేడ్చల్-మల్కాజ్ గిరిలో 20, కామారెడ్డిలో 16, నిజామాబాదులో 15, సంగారెడ్డిలో 13, రాజన్న సిరిసిల్లలో 12, మంచిర్యాలలో 10, ఆదిలాబాద్ లో 10 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ