తెలంగాణలో ముగిసిన ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు, నేడు పరిశీలన

#KCR, 2021 Telangana MLC Elections, 2021 Telangana MLC Elections Schedule, Graduates MLC Elections, Mango News, telangana, Telangana Graduates MLC Elections, Telangana Graduates MLC Elections Nominations, Telangana Graduates MLC Elections Nominations Completed, Telangana MLC Elections, Telangana MLC Elections 2021, Telangana MLC Elections News, Telangana MLC Elections Nominations, Telangana MLC Elections Updates, Telangana Politics

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ మరియు మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-‌హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14 న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు ఫిబ్రవరి 23, మంగళవారంతో నామినేషన్ల గడువు ముగిసింది. ఈసారి రెండు చోట్ల అభ్యర్థులు పెద్దసంఖ్యలో నామినేషన్స్ వేశారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి 110 మంది, ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానానికి 78 మంది మంది అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేశారు. రెండు స్థానాలకు మొత్తం 302 సెట్ల నామి‌నే‌షన్లు దాఖలు అయ్యాయి. ఈ నామినేషన్లను బుధవారం నాడు అధికారులు పరిశీలించనున్నారు. నామి‌నే‌షన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచిన తుది జాబి‌తాను ప్రకటించనున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్:

  • నోటిఫికేషన్ జారీ – ఫిబ్రవరి 16
  • నామినేషన్ల స్వీకరణ ప్రారంభం – ఫిబ్రవరి 16
  • నామినేషన్లకు ఆఖరితేదీ – ఫిబ్రవరి 23
  • నామినేషన్ల పరిశీలన – ఫిబ్రవరి 24
  • ఉపసంహరణకు ఆఖరుతేదీ – ఫిబ్రవరి 26
  • ఎన్నిక జరిగే తేదీ – మార్చ్ 14
  • పోలింగ్ సమయం – ఉదయం 08:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
  • ఓట్ల లెక్కింపు – మార్చ్ 17
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 14 =