తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ మరియు మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14 న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు ఫిబ్రవరి 23, మంగళవారంతో నామినేషన్ల గడువు ముగిసింది. ఈసారి రెండు చోట్ల అభ్యర్థులు పెద్దసంఖ్యలో నామినేషన్స్ వేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి 110 మంది, ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానానికి 78 మంది మంది అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేశారు. రెండు స్థానాలకు మొత్తం 302 సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ నామినేషన్లను బుధవారం నాడు అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచిన తుది జాబితాను ప్రకటించనున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్:
- నోటిఫికేషన్ జారీ – ఫిబ్రవరి 16
- నామినేషన్ల స్వీకరణ ప్రారంభం – ఫిబ్రవరి 16
- నామినేషన్లకు ఆఖరితేదీ – ఫిబ్రవరి 23
- నామినేషన్ల పరిశీలన – ఫిబ్రవరి 24
- ఉపసంహరణకు ఆఖరుతేదీ – ఫిబ్రవరి 26
- ఎన్నిక జరిగే తేదీ – మార్చ్ 14
- పోలింగ్ సమయం – ఉదయం 08:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
- ఓట్ల లెక్కింపు – మార్చ్ 17
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ