తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లనున్నారు. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణగౌడ్ ఇటీవలే మరణించారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ లో నిర్వహించే దశ దినకర్మ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని, మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. సీఎం కేసీఆర్ తో పాటుగా పలువురు పార్టీ నేతలు కూడా మహబూబ్నగర్ కు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ