పవిత్ర హజ్ యాత్ర-2022 కు ఎంపికైన వారు ఈరోజు సాయంత్రం లోగా సంబంధిత పత్రాలు సమర్పించాలని తెలంగాణ హజ్ కమిటీ సూచించింది. ఈ మేరకు వార్షిక యాత్రకు సంబంధించిన పత్రాల సమర్పణకు శుక్రవారం చివరి తేదీ అని తెలంగాణ హజ్ కమిటీ కార్యనిర్వాహక అధికారి బి సైఫుల్లా తెలిపారు. హజ్ యాత్ర-2022 డ్రాలో ఎంపికైన వారు తమ పాస్పోర్టు అందజేయాలని ఆయన సూచించారు. పాస్పోర్టుతో పాటు డౌన్లోడ్ చేసిన హజ్ దరఖాస్తు, డిక్లరేషన్ పత్రం, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించాలని సైఫుల్లా వెల్లడించారు.
అలాగే మే 6, 2022కి ముందు చెల్లింపు రసీదు (ఒక్కొక్కటి రూ. 81,000), రెండు ఫొటోలు, కొవిడ్-19 ధ్రువపత్రం, బ్యాంకు వివరాలు శుక్రవారం సాయంత్రంలోగా అందజేయాలని సైఫుల్లా తెలిపారు. హజ్ యాత్రికులు ఇతర వివరాల కొరకు 040-23298793 నంబర్లో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. యాత్రికులు జూన్ మధ్యలో హజ్కు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సైఫుల్లా పేర్కొన్నారు. ఈ సంవత్సరం హజ్ కమిటీ యాత్రికులందరికీ హ్యాండ్ బ్యాగ్ (క్యాబిన్ బ్యాగేజీ) అందజేస్తోంది. త్వరలో నగరం మరియు జిల్లాల్లో హజ్ శిక్షణా శిబిరాలను కూడా ఏర్పాటు చేయనుంది. శిక్షణ శిబిరాల నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ