మంకీపాక్స్ వ్యాధి గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉందామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో అనుమానిత కేసులు కూడా నమోదు కాలేదన్నారు. సోమవారం డీఎంఈ, టీవీవీపీ వైద్యులతో మంత్రి హరీశ్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మంకీపాక్స్ వ్యాధిపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ట్రాక్ చేస్తోందని చెప్పారు. మంకీపాక్స్ వ్యాధి నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో వ్యాధి నిర్ధారణ, ఫీవర్ ఆసుపత్రిని నోడల్ ఆసుపత్రిగా కేటాయించామని అన్నారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. మంకీపాక్స్ లక్షణాలు, పరీక్షలు మరియు చికిత్స గురించి అవగాహన పెంచాలని మరియు క్షేత్రస్థాయి సిబ్బందికి వివరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మంకీపాక్స్ నమోదైన దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ప్రాథమిక పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. అలాగే సీజనల్ వ్యాధులు, మంకీ పాక్స్, వ్యాక్సినేషన్, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య వివరాలు, సలహాలు కోసం 04024651119, 9030227324 నెంబర్లను సంప్రదించాలని ప్రజలకు మంత్రి హరీశ్ రావు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY