ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేదార్నాథ్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా ఆరుగురు మరణించారు. కేదార్నాథ్కు దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోని గరుడ్ చట్టిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ హెలికాప్టర్లో యాత్రికులు సహా మొత్తం ఆరుగురు ఉన్నారు. గుప్తకాశీలోని ఫటా నుంచి భక్తులతో బయలుదేరిన హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటి తర్వాత అకస్మాత్తుగా కుప్పకూలింది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడ చెల్లాచెదురుగా పడిపోయిన హెలికాప్టర్ శకలాలు, కాలిపోయిన స్థితిలో మృతదేహాలు కనిపించాయి. ప్రస్తుతం దీనిపై వివరాలు సేకరిస్తున్నారని, ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రతికూల వాతావరణం మరియు తక్కువ దృశ్యమానత హెలికాప్టర్ ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని విమానయాన సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
The helicopter crash in Kedarnath is extremely unfortunate. We are in touch with the State government to ascertain the magnitude of the loss, and are constantly monitoring the situation.
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) October 18, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY