తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) కు శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 1 నుంచి 31 వరకు ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తామని ఈసీ కోర్టుకు తెలియజేసింది. ఇందుకు సంబంధించి కొత్తగా మరో నోటిఫికేషన్ జారీచేస్తామని ఈసీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పదవీకాలం ముగియడంతో త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ ప్రక్రియకు ముందుగా నవంబర్ 6 ను చివరి తేదీగా నిర్ణయించారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో గడువును డిసెంబరు 7 వరకు గడువు పెంచాలని న్యాయవాది రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఈ రోజు విచారణ చేపట్టి గడువు పెంపుకు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గడువు పెంచేందుకు ఈసీ నిర్ణయించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ