ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 9వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో మరియు ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ పర్యటనపై అధికారిక షెడ్యూల్ విడుదల చేశారు. ముందుగా మంగళవారం ఉదయం 10:35 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి విమానంలో ఉదయం 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:15 గంటలకు హెలికాప్టర్ లో పాతపట్నం చేరుకుంటారు. అక్కడ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్కు సీఎం వైఎస్ జగన్ హాజరు కానున్నారు. వివాహ రిసెప్షన్ కు హాజరు అనంతరం మధ్యాహ్నం 2.50 గంటలకు తిరిగి సీఎం విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో మధ్యాహ్నం 2.50 గంటలనుంచి 3.30 వరకు సీఎం ప్రోగ్రాంను రిజర్వ్లో ఉంచారు.
ఇక మధ్యాహ్నం 3.30 గంటలకు విమానంలో ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ కు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 4.45 గంటలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నివాసానికి సీఎం చేరుకోనున్నారు. 5 గంటల నుంచి 7 గంటల వరకు సీఎం నవీన్ పట్నాయక్ తో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నట్టు తెలిపారు. ఆతరువాత 7 గంటల నుంచి భువనేశ్వర్ ఎయిర్ పోర్టుకు చేరుకొని, అక్కడి నుంచి విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఇక రాత్రి 8.50 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ