టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైన రెండు దశాబ్దాల తర్వాత ఆ పార్టీ ప్రస్థానంలో నేడు కీలక మలుపు చోటుచేసుకుంది. ఆ పార్టీ 21 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నేడు మరో మెట్టు ఎక్కింది. ఇన్నాళ్లూ రాష్ట్ర పార్టీగా కొనసాగిన టీఆర్ఎస్ జాతీయపార్టీ హోదా అందుకుంది. అయితే ఈ క్రమంలో అది తన పేరుని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మొత్తం 283మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ ‘బీఆర్ఎస్’ ప్రకటన ముఖ్యాంశాలు..
- తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రకటన సందర్భంగా సీఎం కేసీఆర్ తీర్మానంపై సంతకం చేశారు.
- సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పార్టీ సభ్యులు కరతాళ ధ్వనులతో హర్షం తెలిపారు.
- దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీలు కానీ ప్రజలకు ఏమి కావాలో అది గుర్తించట్లేదన్న సీఎం కేసీఆర్.
- జాతీయ రాజకీయాల్లో మార్పు కోసమే తన ప్రయత్నమని, అందరినీ కలుపుకుపోతానని ప్రకటన.
- తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.
- ఇవే పథకాలను దేశమంతటా అమలుచేయాలన్నదే మా సంకల్పం.
- వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తామన్న విశ్వాసం ఉంది.
- కాగా 21 సంవత్సరాల పాటు టీఆర్ఎస్గా ఉన్న రాష్ట్ర పార్టీ, నేటినుంచి బీఆర్ఎస్గా పేరు మార్చుకుని జాతీయ పార్టీగా కొనసాగనుంది.
- ఈ సమావేశానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి మరియు తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధినేత తిరుమవళవన్ లు హాజరయ్యారు.
- సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తెలంగాణ వ్యాప్తంగా మొదలైన పార్టీ శ్రేణుల సంబరాలు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY