ఈ రోజు ఉదయం నుంచీ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం వరకు నిరీక్షణ తప్పలేదు. ఎట్టకేలకు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. పోయిన సంవత్సరం కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సెకండ్ ఇయర్ లోకి ప్రమోట్ చేయటం జరిగింది. అయితే, ప్రభుత్వం గత నెలలో వారికి ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించింది. కాగా, 49% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. tsbie.cgg.gov.in/ సైట్ లో ఫలితాలు అప్ లోడ్ చేసిన తర్వాత విద్యార్థులు తమ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ