BWF ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్ కి చేరుకుంది. తెలుగు తేజం సింధు 3వ రౌండ్ లో థాయిలాండ్ దేశానికి చెందిన షట్లర్ పోర్నపావి చొచువాంగ్ పై విజయం సాధించింది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ గేమ్ లో సింధు 21-14, 21-18 తేడాతో తన ప్రత్యర్థిపై విజయం సాధించింది. ఈ విజయంతో సింధు క్వార్టర్ ఫైనల్ లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్ లో సింధు తైవాన్ క్రీడాకారిణి తై జు యింగ్ తో తలపడనుంది. BWF ప్రపంచ ఛాంపియన్ షిప్ లో సింధు తో పాటు ఇతర భారత క్రీడాకారులు కూడా మంచి ప్రదర్శన చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ