కరీంనగర్ లో మళ్ళీ కరోనా వైరస్ కలకలం సృష్టించింది. స్థానిక చల్మెడ మెడికల్ కాలేజీలో ఒకేసారి 40 మందికి పైగా విద్యార్థులకు కరోనా సోకటం కలవర పెడుతోంది. దీంతో అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం మిగిలిన విద్యార్థులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యే కాలేజీ విద్యార్థులంతా కలసి ఒక పార్టీలో భారీగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాని తర్వాతే, వీరిలో చాలామంది కరోనా బారిన పడ్డారని చెప్తున్నారు. దీంతో జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమై ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణాలో ఒమిక్రాన్ వ్యాప్తిపై భయాందోళనలు నెలకొన్న ఈ తరుణంలో ఇలా ఒకే కాలేజీలో ఇన్ని భారీ కేసులు బయటపడటం సంచలనంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ