తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మరియు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సమన్లు పంపింది. ఈ ఇరువురు నేతలు డిసెంబర్ 1న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం కరీంనగర్ లోని మంత్రి నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు. కాగా సీబీఐ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. సోమవారం సీబీఐ అధికారిగా చెలామణీ అవుతున్న ఓ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వ్యక్తి విశాఖపట్నం వాసి కోవిరెడ్డి శ్రీనివాసరావుగా గుర్తించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
అయితే ఇతనితో మంత్రి గంగుల కమలాకర్ మరియు ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు పరిచయం ఉన్నట్లు తెలిసింది. గ్రానైట్ వ్యాపారాలకు సంబంధించిన కేసుల నుంచి వీరిని తప్పించేందుకు శ్రీనివాస్ కొందరు దర్యాప్తు సంస్థ అధికారులను కలిసి ప్రయత్నించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ జోక్యానికి సంబంధించి ప్రశ్నించటానికి నోటీసులను ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో జరిగే విచారణకు వీరు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE