తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం చంచల్గూడ జైలుకు వెళ్లిన ఆయన, రిమాండ్లో ఉన్న బీజేవైఎం కార్యకర్తలతో ములాఖత్ అయ్యి పరామర్శించారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐటీ శాఖ విఫలం కారణంగానే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత శాఖ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన రేణుక కుటుంబం కోసమే పేపర్ లీకేజీ జరిగిందని, ఆమెకు అక్రమంగా గురుకుల పాఠశాలలో ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఛైర్మన్ను ప్రాసిక్యూట్ చేయాలని, టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని కోరారు. కేసును పక్కదోవ పట్టించేందుకే ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిందని, లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. ఇక కమిషన్ను ప్రశ్నించినందుకు బీజేవైఎం కార్యకర్తలను జైలుకు పంపించారన్న బండి సంజయ్.. ఇలా అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన బీజేవైఎం వెనుకడుగు వేసే ప్రకస్తే లేదని స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE