దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 1,02,601 (0.24%) మంది హోమ్ ఐసొలేషన్స్ లేదా ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కొత్తగా 8,013 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,29,24,130 కు చేరుకుంది. అలాగే కరోనాతో 119 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,13,843 కు పెరిగింది. మరో 16,765 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,23,07,686 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.56 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఫిబ్రవరి 28, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 76,74,81,346
- ఫిబ్రవరి 27న నిర్వహించిన కరోనా పరీక్షలు : 7,23,828
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,29,24,130
- కొత్తగా నమోదైన కేసులు [ఫిబ్రవరి 27–ఫిబ్రవరి 28 (8AM-8AM)] : 8013
- నమోదైన మరణాలు : 119
- రికవరీ అయిన వారి సంఖ్య : 4,23,07,686
- యాక్టీవ్ కేసులు : 1,02,601
- మొత్తం మరణాల సంఖ్య : 5,13,843
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ