తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు డిసెంబర్ 15 న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. కాగా మంత్రి పువ్వాడ అజయ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ రోజు ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో ఫలితం నెగెటివ్ గా వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “మీ ప్రేమాభిమానులే నాకు మందు..నేడు చేసిన కోవిడ్ టెస్ట్(ఆర్టీ-పీసీఆర్) లో నెగెటివ్ వచ్చింది. నాకు కరోనా అని తెలిసి నా కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్ళీ సోమవారం(28.12.2020) నుండి విధులకు హాజరై మీ మధ్యకు వస్తున్న” అని అని మంత్రి పువ్వాడ అజయ్ ట్వీట్ చేశారు.
మీ ప్రేమాభిమానులే నాకు మందు.. నేడు చేసిన Covid టెస్ట్(RT PCR) లో నెగెటివ్ వచ్చింది. నాకు కరోనా అని తెలిసి నా కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్ళీ సోమవారం(28.12.2020) నుండి విధులకు హాజరై మీ మధ్యకు వస్తున్న.. @TelanganaCMO @MinisterKTR @KTRTRS @trspartyonline pic.twitter.com/SpWoBNBMj3
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) December 26, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ