దక్షిణాది అతిపెద్ద కుంభమేళాను తలపించే, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే మేడారం గిరిజన జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు భక్తులకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ , పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. శనివారం నాడు రాష్ట్ర మంత్రులు, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా జంపన్న వాగు ప్రాంతాలను పరిశీలించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జిల్లా అధికారులతో జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల ద్వారా ద్వారా చేపట్టిన కార్యక్రమాలపై మంత్రులు సమీక్షించారు.
ఫిబ్రవరి 18న మేడారం జాతరకు సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం:
అనంతరం మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మేడారానికి వచ్చే ప్రతి సామాన్య భక్తునికి సమ్మక్క-సారలమ్మ ఆశీస్సులు పొందేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి ఫిబ్రవరి 18వ తేదీన సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మేడారం జాతరకు అత్యంత గౌరవం దక్కిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు మేడారం జాతరకు 332 కోట్లతో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించామని మంత్రి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ