తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను నేడు (నవంబర్ 9, మంగళవారం) నోటిఫికేషన్ విడుదల కానుంది. అభ్యర్థులు నామినేషన్స్ దాఖలుకు ఆఖరితేదీ నవంబర్ 16గా నిర్ణయించారు. నామినేషన్ల పరిశీలన నవంబర్ 17న చేపట్టనుండగా, ఉపసంహరణకు నవంబర్ 22 వరకు అవకాశమిచ్చారు. ఇక నవంబర్ 29 తేదీన ఉదయం 09:00 నుంచి సాయంత్రం 04:00 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.
ముందుగా తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన గుత్తా సుఖేందర్రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఆకుల లలిత, ఫరీదుద్దీన్ పదవీకాలం జూన్ 3,2021 తో ముగిసింది. సభ్యుల పదవీ కాలం ముగియక ముందే ఈసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, కరోనా పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్సీ ఎన్నికలును వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఇటీవలే ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. కాగా ఆరుగురి స్థానాలు దక్కించుకునేందుకు అవసరమైన ఎమ్మెల్యే సీట్లు టీఆర్ఎస్ పార్టీకి ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం లాంఛనమే కానుంది. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ