ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (నవంబర్ 9, మంగళవారం) శ్రీకాకుళం జిల్లాలో మరియు ఒడిశా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ముందుగా సీఎం వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం చేరుకుని, అక్కడ పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ రెసెప్షన్ లో సీఎంతో పాటుగా స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సిదిరి అప్పలరాజు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సీఎం వైఎస్ జగన్ విమానంలో ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ కు బయలుదేరి వెళ్లారు. సాయంత్రం 4.45 గంటలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నివాసానికి సీఎం చేరుకోనున్నారు. 5 గంటల నుంచి 7 గంటల వరకు సీఎం నవీన్ పట్నాయక్ తో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశం సహా ఇరు రాష్ట్రాలకు చెందిన పలు పెండింగ్ అంశాలపై సీఎంలు ఇద్దరు చర్చించనున్నట్టు సమాచారం. ఆతరువాత 7 గంటల నుంచి భువనేశ్వర్ ఎయిర్ పోర్టుకు చేరుకొని, అక్కడి నుంచి విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు సీఎం చేరుకుంటారు. ఇక రాత్రి 8.50 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ