తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేసారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ఇటీవలే ప్రభుత్వం భూములు వేలం వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ భూముల సందర్శన, నిరసనకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రేవంత్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేసినట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
ముందుగా రేవంత్ రెడ్డి సహా వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహా, మహేష్ గౌడ్ నేతృత్వంలోని టీపీసీసీ కమిటీ కోకాపేట భూములను సందర్శించేందుకు ప్లాన్ చేసింది.ఈ క్రమంలోనే తెల్లవారుజాము నుంచే పోలీసులు భారీగా మోహరించి రేవంత్ రెడ్డిని గృహనిర్భంధం చేశారు. మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే ఇతర కాంగ్రెస్ నేతలను కూడా పోలీసుల అడ్డుకునే అవకాశమున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ