కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా రాజ్భవన్ లో ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీన ఆనవాయితీగా నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమం ఈ సంవత్సరం రద్దు అయింది. కోవిడ్-19 నివారణ నిబంధనలు పాటిస్తూ, రాజ్భవన్ లో ఓపెన్ హౌస్ నిర్వహించడం లేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ నాడు ఉదయం 10 గంటల నుండి 11 గంటల మద్య ఒక గంటపాటు ఫోన్-ఇన్ ద్వారా ప్రజల నుండి రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు స్వీకరిస్తారు. గవర్నర్ కు శుభాకాంక్షలు తెలియజేయాలనుకునేవారు 040-23310521 నంబర్ కు ఉదయం 10 గంటల నుండి 11 గంటల మద్య ఫోన్ చేయవచ్చని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ