తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1421 కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. దీంతో అక్టోబర్ 22, గురువారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,29,001 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే ఈ వైరస్ వలన ఇప్పటికీ మరణించిన వారి సంఖ్య 1298 కి పెరిగింది.
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 2,07,326 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా, గత 24 గంటల్లోనే 1,221 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 20,377 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా పరీక్షలు సంఖ్య 40 లక్షలు దాటింది. గురువారం నాడు 38,484 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 40,17,353 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 1,07,935 పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu