తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై గురువారం నాడు కీలక ప్రకటన చేశారు. ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేయబడుతుందని ప్రకటించారు. “ప్రపంచాన్ని భయానికి గురిచేసిన కరోనా వైరస్ కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో ప్రజల రక్షణ కోసం తమిళనాడు ప్రభుత్వం ఎల్లప్పుడూ మద్దతుగా, సిద్ధంగా ఉంటుంది. కరోనా వ్యాక్సిన్ కనుగొనబడిన తర్వాత ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేయబడతాయి. తమిళనాడు ప్రజల ప్రతి జీవితం రాష్ట్రానికి ముఖ్యం” అని సీఎం పళనిస్వామి ప్రకటించారు.
మరోవైపు బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే బీహార్ రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా వేయిస్తామని బీజేపీ హామీ ఇవ్వడంపై ప్రతి పక్షాలు సహా పలు వర్గాలనుంచి విమర్శలు వస్తున్నాయి. బీజేపీ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడులో కూడా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu