దేశంలో కరోనా ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 60 వేల కంటే తక్కువుగా పాజిటివ్ కేసుల నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 54,366 కరోనా కేసులు నమోదవగా, 690 మంది మరణించారు. దీంతో అక్టోబర్ 23, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 77,61,312 కు, మరణాల సంఖ్య 1,17,306 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఒకే రోజులో 73,979 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 69,48,497 కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో రికవరీ రేటు 89.53 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 1.51 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 6,95,509 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu