తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 401 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 19, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,86,422కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 865 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,76,667 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా, మరణాల రేటు 0.52 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన ఒకరు మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,109 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,646 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 124, మేడ్చల్ మల్కాజ్గిరిలో 26, ఖమ్మంలో 25, రంగారెడ్డిలో 24, మంచిర్యాలలో 23, హనుమకొండలో 16, భద్రాద్రి కొత్తగూడెంలో 16, యాదాద్రి భువనగిరిలో 12, కరీంనగర్ లో 12, మహబూబ్ నగర్ లో 11, సంగారెడ్డిలో 10 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ