తెలంగాణ రాష్ట్ర డేటా సెంటర్ (ఎస్డీసీ)లో కొత్త యూపీఎస్ యూనిట్ ఏర్పాటు చేస్తుండడంతో ప్రభుత్వ వెబ్సైట్ల సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు రాష్ట్రంలోని 141 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ చేపట్టే కార్డ్ విధానం, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ సేవలు స్టేట్ డేటా సెంటర్ కు అనుసంధానమై ఉన్నాయి. కొత్త యూపీఎస్ ఏర్పాటు పనులు శుక్రవారం నుంచే ప్రారంభం కానుండడంతో రాష్ట్రంలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం లేదు. ఇక రెండో శనివారం, ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో తిరిగి సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు యథావిధిగా ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఇతర ప్రభుత్వ వెబ్సైట్ల సేవలకు కూడా జూలై 9వ తేదీ రాత్రి 9 గంటల నుంచి జూలై 11న రాత్రి తొమ్మిది గంటల వరకు అంతరాయం కలగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ