దేశవ్యాప్తంగా ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కోవిడ్ మూడో వేవ్ నేపథ్యంలో త్వరగా పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు దేశంలో పలు ఫార్మా సంస్థలు క్లినికల్ ట్రయల్స్ ను ముమ్మరంగా కోనసాగిస్తున్నాయి. తాజాగా వ్యాక్సినేషన్ కు సంబంధించిన జాతీయ నిపుణుల కమిటీ చీఫ్ డా.ఎన్కే అరోరా ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సెప్టెంబరు నుంచి 12-18 ఏళ్ల వారికి జైడస్ వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 12 నుంచి 18 ఏళ్ల వారిపై జైడస్ కాడిలా చేస్తున్న క్లినికల్ ట్రయల్స్ డేటా త్వరలోనే రానుందని, అత్యవసర వినియోగ అనుమతులు అనంతరం సెప్టెంబరు చివరి నుంచి వారికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని పేర్కొన్నారు.
అలాగే పిల్లలపై కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో లేదా వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి ప్రారంభంలో 2 నుండి 18 సంవత్సరాల ఏజ్ గ్రూప్ కు కూడా కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సంకేతాలు కన్పిస్తున్నాయని ఎన్కే అరోరా పేర్కొన్నట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2-18 ఏళ్లున్న వారిపై రెండు/మూడో దశల్లో కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు భారత్ బయోటెక్ సంస్థకు ఇటీవలే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ