తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 134 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 19, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,79,564 కి పెరిగింది. అలాగే కరోనాతో మరోకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,015 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక ఆదివారం నాడు 25,900 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 201 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,71,856 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,693 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
20 కి చేరిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు:
అదేవిధంగా ఇప్పటివరకు రిస్క్ కంట్రీస్ నుండి 7738 మందిరాగా, నలుగురికి ఒమిక్రాన్ కరోనా వేరియంట్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. ఇక రిస్క్ కంట్రీస్ నుండి కాకుండా ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో ర్యాండమ్ గా నిర్వహించిన కరోనా పరీక్షల ఆధారంగా మరో 16 మందిలో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 20 కు చేరుకుంది. మరో 7 శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపగా, ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ