దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. వరుసగా 29 రోజూ కూడా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువుగా నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 91,702 కేసులు, 3403 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,74,823 కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,63,079 కి పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, అస్సాం, తెలంగాణ, పంజాబ్ వంటి 10 రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 11,21,671 (3.83%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరో 1,34,580 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 2,77,90,073 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 94.93 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.24 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలివే (జూన్ 10 8am–జూన్ 11 8am) :
- తమిళనాడు – 16813
- కేరళ – 14424
- మహారాష్ట్ర – 12207
- కర్ణాటక – 11042
- ఆంధ్రప్రదేశ్ – 8110
- ఒడిశా – 6097
- వెస్ట్ బెంగాల్ – 5274
- అస్సాం – 3756
- తెలంగాణ – 1798
- పంజాబ్ – 1311
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ