తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 156 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో డిసెంబర్ 20, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,79,720 కి చేరింది. కాగా కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదవలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,015 గా ఉంది. అలాగే మరో 207 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి 6,72,063 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 53, మేడ్చల్ మల్కాజిగిరిలో 22, రంగారెడ్డిలో 14, సిద్దిపేటలో 12, ఖమ్మంలో 11 నమోదయ్యాయి.
మరోవైపు తెలంగాణలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కేసుల సంఖ్య 20గా ఉంది. ఇప్పటివరకు రిస్క్ కంట్రీస్ వచ్చిన వారిలో నలుగురికి, రిస్క్ కంట్రీస్ నుండి కాకుండా ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో ర్యాండమ్ గా నిర్వహించిన కరోనా పరీక్షల ఆధారంగా మరో 16 మందిలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. కాగా ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలిన మరో 15 మంది శాంపిల్స్ ను ఒమిక్రాన్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపగా, ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు.
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు (డిసెంబర్ 20, సాయంత్రం 5.30 గంటల వరకు):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 2,93,18,416
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 6,79,720
- కొత్తగా నమోదైన కేసులు : 156
- కొత్తగా నమోదైన మరణాలు : 0
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 6,72,063
- కరోనా రికవరీ రేటు: 98.87%
- యాక్టీవ్ కేసులు: 3,642
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 4,015
- కరోనా మరణాల రేటు: 0.59%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ